Dr.Dasari Sudha MLA, Badvel.

  • Home
  • Dr.Dasari Sudha MLA, Badvel.

Dr.Dasari Sudha MLA, Badvel. YSRCP, BADVEL CONSTITUENCY M.L.A.,

"ఈ రోజు బద్వేల్ మున్సిపాలిటీ నందు 24 వ వార్డు లో కోటి సంతకాలు కార్యక్రమం"ఈ కార్యక్రమం లో  శ్రీ సుందర రామిరెడ్డి, యద్ద రె...
04/11/2025

"ఈ రోజు బద్వేల్ మున్సిపాలిటీ నందు 24 వ వార్డు లో కోటి సంతకాలు కార్యక్రమం"
ఈ కార్యక్రమం లో శ్రీ సుందర రామిరెడ్డి, యద్ద రెడ్డి, పోలిరెడ్డి, రమణారెడ్డి,కేశవరెడ్డి, వార్డు ఇంచార్జీ వెంకట సుబ్బయ్య, సునీల్, ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.

ప్రజలతో కలిసి ప్రైవేటీకరణ ను కచ్చితంగా అడ్డుకుంటాం : బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు ఈ రోజు బద్వేల్ మున...
03/11/2025

ప్రజలతో కలిసి ప్రైవేటీకరణ ను కచ్చితంగా అడ్డుకుంటాం : బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

ఈ రోజు బద్వేల్ మున్సిపాలిటీ నందు 10 వ వార్డు లో కోటి సంతకాలు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు హాజరై

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

మాజీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో మా ప్రభుత్వం లో 17 మెడికల్ కాలేజీలు లకు శ్రీకారం చుట్టడం జరిగింది అని తెలిపారు

పేదలకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన వైద్యం అందించాలని,వైద్య విద్య కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే అందేలా,పేద విద్యార్థులు సైతం సులభతరంగా వైద్య విద్యను అభ్యసించాలి అని ఒక మంచి ఉద్దేశం తో ఈ 17 మెడికల్ కాలేజీలు లకు శ్రీకారం చుట్టడం జరిగింది అని తెలిపారు

17 మెడికల్ కాలేజీ లు ప్రారంభించి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసి సీట్లు కూడా అందుబాటు లోకి తేవడం జరిగింది అని తెలిపారు

మా ప్రభుత్వం లో వైద్య రంగం లో కని విని ఎరుగని రీతి లో విప్లవాత్మకమైన మార్పులు తేవడం జరిగింది అని తెలిపారు

ముఖ్యంగా

54000 వేల ఉద్యోగాలు పూర్తి స్థాయి లో భర్తీ చేసి ఎక్కడా కూడా కాలీ లేకుండా చేయడం

400 కోట్లతో 512 అర్బన్ హెల్త్ సెంటర్లు కొత్తగా ప్రారంభించడం

350 కోట్లతో కొత్తగా 108,104 వాహనాలు కొనుగోలు చేయడం

ఆరోగ్య శ్రీ ని 25 లక్షలకు పెంచడం

గతం లో ఆరోగ్య శ్రీ కింద 1020 ప్రొసీజర్ లు ఉంటే వాటి ని కొత్తగా 3250 కి పెంచడం

ప్రతి గ్రామం లో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేసి అక్కడే ఒక నర్సు ను కూడా నియమించడం జరిగింది

ఎప్పుడూ లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టీ నెలకు రెండు సార్లు వైద్యులను గ్రామాలకు పంపించేలా చేయడం జరిగింది అని తెలిపారు

ఈ విధంగా మా ప్రభుత్వం లో ఎప్పుడూ లేని విధంగా వైద్య రంగం లో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది అని కొనియాడారు

కానీ ఈ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ను ప్రైవేటీకరణ చేస్తూ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం చాలా దారుణం

ప్రైవేటీకరణ చేయడం వలన

పేదలకు నాణ్యమైన వైద్యం అందదు.మళ్ళీ వైద్యం కోసం అప్పులు చేయాలి

వైద్య విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు వైద్యవిద్య అందదు.వారు వైద్య విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లి కోట్ల రూపాయలతో చదవాలి ఇది పేద విద్యార్థులకు చాలా కష్టం

ప్రైవేటీకరణ చేసి ఒక సంస్థ కు కాలేజీ లను అప్ప చెప్పి వారి ద్వారా కోట్ల రూపాయలు దండుకోవాలని ఈ కూటమి నాయకులు ఆలోచన

కావున మా వై.యస్.ఆర్.సి పార్టీ తరుపున మా నాయకుడు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో ప్రజలతో కలిసి ఒక ఉద్యమం లాగా గ్రామ గ్రామ నా తిరిగి ప్రజలను చైతన్యం పరిచి కోటి సంతకాలు సేకరించి ఈ ప్రైవేటీకరణను కచ్చితంగా అడ్డుకుంటాం అని తెలిపారు

ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీ సుందర రామిరెడ్డి,వైస్ చైర్మన్లు శ్రీ సాయి, శ్రీ గోపాల్ స్వామి,కౌన్సిలర్ లు శ్రీ వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ మెంబర్ రామ చంద్ర రెడ్డి,నాయకులు శ్రీ రఘు రామి రెడ్డి, శ్రీ సాంబ శివ రెడ్డి ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు

బద్వేలు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుభావన నగర్ పరిధిలోని నేడు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిర...
03/11/2025

బద్వేలు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుభావన నగర్ పరిధిలోని నేడు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు

ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గార్లుమాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ హయాంలో కోవిడ్‌ తర్వాత ఏడు కళాశాలలు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఐదు మెడికల్‌ కళాశాలలను అందుబాటులోకి తెచ్చాం. నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్‌తో రెండు కళాశాలలు అందుబాటులోకి రాలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే.. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర చేస్తున్నారు. కూటమి నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుంది.

చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి అందజేస్తాం.. సీఎం చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంది. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, రాజకీయాలకు అతీతంగా పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాను..అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు మరియు మున్సిపాలిటీ అబ్జర్వర్లునాగార్జున రెడ్డి,లయన్ భాస్కర్ రెడ్డి అంబవరం వైఎస్ఆర్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపాలస్వామి, మున్సిపాలిటీ పార్టీ కన్వీనర్ సుందర్ రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు, కౌన్సిలర్లు, రాష్ట్ర మరియు జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ డైరెక్టర్లు, పార్టీ మహిళా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రచ్చబండ కార్యక్రమం — మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణనియోజకవర్గం: బద్వేల్మండలం: బద్వేల్ మండల...
02/11/2025

రచ్చబండ కార్యక్రమం — మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

నియోజకవర్గం: బద్వేల్
మండలం: బద్వేల్ మండలం
పంచాయతీ: అనంతరాజపురం
గ్రామం: ఎగువ బోయినపల్లి
తేదీ: 02-11-2025

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ మరియు వైఎస్ఆర్సీపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారు..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ మండలం, కోన సముద్రం పంచాయతీ, జోగి గారి పల్లె గ్రామం నందు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారు మాట్లాడుతూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు, ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రజలలో చైతన్యం తెచ్చే విధంగా తీసుకువెళ్లాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గం లోని అన్ని మండలాలు పంచాయితీలో సంతకాల సేకరణ కార్యక్రమం నాయకులు కార్యకర్తలు చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని YSRCP కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి మద్దతుగా సంతకాలు చేశారని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు.
ప్రజా వైద్య సదుపాయాల రక్షణ కోసం ప్రతి సంతకం ప్రజా హక్కుల కోసం ఒక బలమైన స్వరం.

ఈ కార్యక్రమంలో బద్వేల్ మండలం మండల మండల ప్రెసిడెంట్ మల్లేశ్వర్ రెడ్డి, జడ్పిటిసి పోల్ రెడ్డి, ఎంపీపీ రామ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ జయ సుబ్బారెడ్డి, కుప్పల రమణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మిరెడ్డి, కృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

కోటి సంతకాలు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి డా దాసరి సుధ గారు గోపవరం మండలం కాలువపల్లి గ్రామంలో ప్రైవేట్ కాలేజ...
31/10/2025

కోటి సంతకాలు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి డా దాసరి సుధ గారు

గోపవరం మండలం కాలువపల్లి గ్రామంలో ప్రైవేట్ కాలేజ్ లకు వ్యతిరేకంగా వై.యస్.ఆర్.సి పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశం తో పేదలకు నాణ్యమైన వైద్యం,కార్పొరేట్ తరహా లో అందించాలని ఉద్దేశం మరియు మన పిల్లలు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య విద్య అభ్యసించే విధంగా మెడికల్ సీట్లు పెంచి సాహిపేస నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు

17 మెడికల్ కాలేజీలు లకు శ్రీకారం చుట్టి చరిత్ర లో ఎవరూ చేయని విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు

ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం అని కావున మా పార్టీ తరుపున,ప్రజల పక్షాన పోరాడతాం అని తెలిపారు

ఈ కార్యక్రమం లో గోపవరం మండల అధ్యక్షుడు శ్రీ రవి చంద్ర రెడ్డి,బద్వేల్ మండల అధ్యక్షుడు శ్రీ మల్లేశ్వర రెడ్డి,యం.పి.పి శ్రీ రామ సుబ్బా రెడ్డి,యస్.సి సెల్ అధ్యక్షుడు శ్రీ పుల్లయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు

30/10/2025

మెంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పొలాలను బద్వేల్ మండలం,గోపవరం మండలాలలో రైతులతో కలిసి పరిశీలించిన బద్వేల్ నియోజక వర్గ శాసన సభ్యురాలు శ్రీమతి డా.దాసరి సుధ.

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు. ఈ రోజు మెంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ...
30/10/2025

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు.

ఈ రోజు మెంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పొలాలను బద్వేల్ మండలం,గోపవరం మండలాలలో రైతులతో కలిసి పరిశీలించిన బద్వేల్ నియోజక వర్గ శాసన సభ్యురాలు శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు.

ఈ రోజు ఎమ్మెల్యే గారు గుండంరాజుపల్లి,కాలువ పల్లె గ్రామాల్లో పర్యటించి ఈ అకాల తుఫాన్ వల్ల నష్టపోయిన వరి,మినుము మరియు ఇతర పంటలను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

తుఫాన్ వల్ల సుమారుగా ఈ రెండు మండలలో 600 ఎకరాలు నష్టపోవడం జరిగింది అని తెలిపారు.

కావున వ్యవసాయ అధికారులు వెంటనే గ్రామ గ్రామాన తిరిగి నష్టపోయిన ప్రతి పంటను వెంటనే ఎన్యూమరేట్ చేయాలని కోరడం జరిగింది.

ఈ ప్రభుత్వం లో ఉచిత పంటల బీమా ఎత్తేయడం జరిగింది అని విమర్శించారు.

దీని వలన సుమారు 60 లక్షలు మంది రైతుల పంటల బీమా కు దూరం కావడం జరిగింది అని తెలిపారు.

జగనన్న ప్రభుత్వ లో పూర్తిగా ప్రభుత్వమే రైతుల తరుపున ఉచితంగా బీమా ను కట్టి ఉచిత పంటల బీమా ను పారదర్శకంగా అమలు చేసి రైతులకు సీజన్ అయి పోయెలోపు డబ్బులు చెల్లించడం జరిగింది అని తెలిపారు.

మా ప్రభుత్వం లో ప్రతి పంచాయితీ లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని రకాలుగా విత్తనం నుండి అమ్ముకునే దాకా అండగా నిలిచింది అని తెలిపారు

ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను విమర్శించి పూర్తిగా పెత్తందారులకు అనుకూలంగా పని చేస్తుంది అని తెలిపారు

కావున ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని లేకుంటే వై.యస్. ఆర్.సి.పార్టీ తరుపున రైతుల పక్షాన పోరాడతాం అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో యం.పి.పి. శ్రీ బోడపాడు రామ సుబ్బా రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీ మల్లేశ్వర రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీ రవి చంద్ర రెడ్డి,ఉప సర్పంచ్ శ్రీ కుప్పల రమణ,నియోజక వర్గ యస్.సి సెల్ అధ్యకులు శ్రీ పుల్లయ్య,మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు శ్రీ సునీల్ ,శివ రైతులు పాల్గొన్నారు

25/10/2025

"బద్వేల్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ". YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy

"తునిలో బాలికపై జరిగిన ఘటన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన"బద్వేల్ లో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను తన...
24/10/2025

"తునిలో బాలికపై జరిగిన ఘటన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన"

బద్వేల్ లో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను తనకీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ...

విద్యార్థినిలను బయటికి పంపించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచన... YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy

వైఎస్ఆర్సిపి అధిష్టానం ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు కడప ...
24/10/2025

వైఎస్ఆర్సిపి అధిష్టానం ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు శ్రీ కె. సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం ఎస్. బి. అంజాద్ భాష గారు, బద్వేలు శాసనసభ్యులు దాసరి సుధా మేడం గారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.సి మెంబర్లు, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు ఉన్నారు.

22/10/2025

రాజమండ్రి వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్న పదో తరగతి బాలికకు అజేయ్ అనే యువ‌కుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడంటే రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ అనేది ఉందా గారూ? మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నామ‌ని మాట‌ల్లో చెప్ప‌డం కాదు చ‌ర్య‌ల్లో క‌నిపించాలి.

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
20/10/2025

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Dasari Sudha MLA, Badvel. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram