Dr.Dasari Sudha MLA, Badvel.

  • Home
  • Dr.Dasari Sudha MLA, Badvel.

Dr.Dasari Sudha MLA, Badvel. YSRCP, BADVEL CONSTITUENCY M.L.A.,

ఈ మకర సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషాలతో, సిరి సంపదలతో, పాడి పంటలతో, నిండి ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్...
15/01/2026

ఈ మకర సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషాలతో, సిరి సంపదలతో, పాడి పంటలతో, నిండి ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

బద్వేలు నియోజకవర్గం ప్రజలకు, వైయస్.ఆర్.సిపి నాయకులకు, కార్యకర్తలకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు, మిత్రులకు,అభీమానులక...
14/01/2026

బద్వేలు నియోజకవర్గం ప్రజలకు, వైయస్.ఆర్.సిపి నాయకులకు, కార్యకర్తలకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు, మిత్రులకు,అభీమానులకు, భోగి పండుగ శుభాకాంక్షలు.

బద్వేలు నియోజకవర్గం ప్రజలకు, వై.యస్.ఆర్.సి.పి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మిత్రులకు,ష్రేయొభిలాషులకు , ఈ 2026 నూత...
01/01/2026

బద్వేలు నియోజకవర్గం ప్రజలకు, వై.యస్.ఆర్.సి.పి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మిత్రులకు,ష్రేయొభిలాషులకు , ఈ 2026 నూతన సంవత్సరం లో రైతు లు పాడి పంటలతో వర్ధిల్లాలని,అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని, తాము చేపట్టబోయే ప్రతి పని నూతన సంవత్సరం లో దిగ్విజయం కావాలని,నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితం లో ఒక నూతన ఒరవడిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కరుణామయుడు ఆ యేసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని "ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో ప్రేమ శాంతి ఆనందం అనే వెలుగులతో నిండి ఉండ...
25/12/2025

కరుణామయుడు ఆ యేసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని "ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో ప్రేమ శాంతి ఆనందం అనే వెలుగులతో నిండి ఉండాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు".

వైయస్.ఆర్.సి.పి అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనలో భాగంగా నిన్నటి దినం...
24/12/2025

వైయస్.ఆర్.సి.పి అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనలో భాగంగా నిన్నటి దినం పులివెందుల లోని క్యాంపు కార్యాలయంలో ఆయన ను మర్యద పూర్వకంగా కలవడం జరిగింది.

జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పుట్టినరోజు వేడుకల్లో...
21/12/2025

జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బద్వేల్ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధ.

 జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.
21/12/2025


జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి  ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసిన గౌరవ ఎమ్మెల్యే శ్ర...
18/12/2025

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

ఈ రోజు విజయవాడ నందు మెడికల్ కాలేజీలు లకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాలు గౌరవ గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్ని అనంతరం మన గౌరవ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న గౌరవ బద్వేల్ నియోజక వర్గ శాసన సభ్యురాలు శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

అనంతరం శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి 21 వ తేదీ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి కి ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను జెండా ఊపి తాడేపల్లిలోని పార్టీ క...
18/12/2025

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను జెండా ఊపి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్‌‌భవన్‌కు పంపించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు....🇸🇱🔥కడపలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు....మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యత...
15/12/2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు....🇸🇱🔥

కడపలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు....

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తిచేసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి కేంద్ర కార్యాలయంకు పత్రాలను చేరవేసే కార్యక్రమంలో కడప నగరంలో భారీ ర్యాలీ....

జిల్లా పార్టీ కార్యాలయం నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు సాగిన ర్యాలీ..

ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రా రెడ్డి, డిసి గోవింద్ రెడ్డి,మేయర్ పాక సురేష్,ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...

హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మహానేత డాక్టర్. వైఎస్ఆర్ కు పూలమాలవేసి ఘనంగా నివాళులు..

నియోజకవర్గల్లో పూర్తి అయిన సంతకాల సేకరణ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడ తాడేపల్లికు తరలింపు..

జెండా ఊపి విజయవాడ తాడేపల్లికు తరలించిన నేతలు..

రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా సంతకాలు సేకరించారు..

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ....

ప్రభుత్వానికి గుండెలు అదిరేలా కోటి సంతకాల సేకరణ..

అన్ని అమ్మేస్తున్న చంద్రబాబు..

99పైసలకే ప్రభుత్వ భూములను దోచిపెట్టారు..

లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చెయ్యలేదు..

వైద్య రంగాన్నే కాదు అనేకమైన వాటిని అనునాయులకు దోచి పెడుతున్న చంద్రబాబు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు కక్ష సాధింపు చర్యలు చేస్తోంది..

ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ప్రజలే తీర్పు ఇస్తారు..

అన్నింటిని అమ్మేస్తున్న చంద్రబాబు..

ప్రజలకు అండగా ఉండే పార్టీ వైసీపీనే..

పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం కాకుండా పోరాటం చేస్తాం..

పేదల పక్షపాతి జగన్.. అందుకే రాష్ట్రంలో 17వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేసిన జగన్..

వాటిని ప్రయివేట్ పరం చెయ్యదాన్ని ప్రజలే తిప్పికొట్టాలి..

అన్ని వ్యవస్థలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం..

పేద విద్యార్థుల వైద్యులు కావాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ తపన పడ్డారు..

కానీ కూటమి ప్రభుత్వానికి పేదలకు మేలు చేయాలనే ఆలోచన లేదు..

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు..

ప్రయివేట్ వ్యక్తులకు వైద్య కళాశాలలను కట్టబెడితే పెద విద్యార్థులకు ఉచితంగా సీట్ ఇస్తారా..

మోసపురితంగా ప్రజలను వంచెన చేసిన చంద్రబాబు.

ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిచే కుటుంబం వైఎస్ కుటుంబం..

ప్రజా సమస్య.. పేద ప్రజల ఉద్యమం..

కాదని ప్రయివేట్ పరం చేస్తే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుంది..

ప్రజా ఉద్యమం కోసం కదం తొక్కడం చంద్రబాబుకు గొడ్డలిపెట్టు..

గ్రామాల్లో పరిస్థితి మెరుగు పడుతుందని భావిస్తే కూటమి అధికారంలోకి వచ్చాక భిన్నంగా ఉన్నాయి..

గ్రామాల్లో చిచ్చు పెట్టి ఉద్రిక్త వాతావరణానికి తెరలేపారు..

ప్రతీ పనిలోనూ కమిషన్ ల పర్వం కొనసాగుతోంది..

ఏ రోజు ఎన్నికలు జరిగినా గెలిచేది వైసీపీ పార్టీనే..

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడపట్టి బయటకు లాగుతాం..

రెండు లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి..

అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే మిగితా ప్రాంతాల పరిస్థితి ఏమిటి..

ఏ ఒక్క పథకానైనా సక్రమంగా అమలు చేస్తున్నావా చంద్రబాబు..

గొప్పలు చెప్పడం కాదు...

అమరావతికి వెచ్చించే నిధుల్లో కొంత భాగం ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలతో మెడికల్ కాలేజీలు పూర్తి చెయ్యవచ్చు..

రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు..

కమిషన్ ల కోసం కక్కుర్తి పడుతూ ప్రభుత్వ ఆస్తులను దోచి పెడుతున్న జగన్..

ప్రజా ఆగ్రహంపై చంద్రబాబు కళ్ళు తెరిచి చూడాలి..

చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని గ్రహించు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇన్చార్జులు, జోన్ అధ్యక్షులు, డివిజన్ అబ్జర్వర్లు, జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గ్రామ స్థాయి పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలి:ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారుగౌరవ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్య...
14/12/2025

గ్రామ స్థాయి పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలి:ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

గౌరవ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు గ్రామ స్థాయి కమిటీ ఏర్పాటు సమావేశాన్ని అట్లూరు మండలం కుంబగిరి మరియు తంబలగొంది పంచాయతీ ల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. దాసరి సుధ మేడం గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అవసరమైన కమిటీలు గ్రామస్థాయి నుంచే బలోపేతం చేయాలనే దృష్టితో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ నిర్ణయం తీసుకున్నారని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కమిటీ నిర్మాణ ప్రక్రియను తొలిసారిగా కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేలు నియోజకవర్గంలో ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు. ఏర్పాటు చేసే కమిటీలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ, ఈ నెల 15వ తేదీలోపు అన్ని కమిటీలను ప్రకటించాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రతి గ్రామంలో పార్టీ అభిమానులు, చురుకైన కార్యకర్తలను గుర్తించి కమిటీల్లో చేర్చాలని సూచించారు. ఈ కమిటీల వివరాలు నేరుగా జగనన్న డాష్‌బోర్డ్‌కు లింక్ అవుతాయని, సంక్రాంతికల్లా పార్టీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు.

2019 నుండి 2024 వరకు జగనన్న పరిపాలనా ఒక స్వర్ణ యుగం లాంటిది అని తెలిపారు*

*జగనన్న ప్రభుత్వం లో రాష్ట్రం లో పేదలకు వివిధ పథకాలు రూపం లో 2.70 వేల కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతా లలో జమ చేయడం జరిగింది అని తెలిపారు

15000 వేల సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక లక్ష ముప్పై వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం జరిగింది

కావున మన ప్రభుత్వం లో చేసిన మంచిని ప్రజలకు వివరించాలని తెలిపారు

తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసే వరకు కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగనన్న 2.0లో కార్యకర్తలే పరిపాలనలో కేంద్రబిందువుగా ఉంటారని, రాబోయేది జగనన్న ప్రభుత్వమే అని నమ్మకంగా చెప్పారు. మరోవైపు 18 నెలల కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పేదల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ సూరా రెడ్డి, జడ్.పి.టి.సి శ్రీ అందూరి రామకృష్ణా రెడ్డి,మాజీ డైరెక్టర్స్ శ్రీ బాల ముని రెడ్డి, శ్రీ మల్లికార్జున రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బ్రహ్మ నంద రెడ్డి,సర్పంచ్ లు శ్రీమతి గంగమ్మ, శ్రీ సుబ్బారాయుడు,సీనియర్ నాయకులు శ్రీ పెంచల్ రెడ్డి, శ్రీ లక్ష్మి రెడ్డి, శ్రీ చిన్న బయపు రెడ్డి, శ్రీ జయ రామ్ రెడ్డి,పలు ప్రజా ప్రతినిధులు తదితర నాయకులు పాల్గొన్నారు.

💥"గ్రామ స్థాయి కమిటీ లే పార్టీ కి పట్టు కొమ్మలు"💥🙏ప్రజా వైద్యం ప్రజల హక్కు అన్న నినాదంతో, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట్...
10/12/2025

💥"గ్రామ స్థాయి కమిటీ లే పార్టీ కి పట్టు కొమ్మలు"💥

🙏ప్రజా వైద్యం ప్రజల హక్కు అన్న నినాదంతో, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట్లాది గళాలు ఏకమవుతున్న “ప్రజా ఉద్యమం” కార్యక్రమంలో భాగంగా నేడు బద్వేలు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుకు స్పందిస్తూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విశాలంగా పాల్గొన్న ఈ ర్యాలీని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. బద్వేలు టౌన్‌లోని ఎమ్మెల్యే గారి పార్టీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజలు స్వచ్ఛందంగా సంతకం చేసిన పత్రాలను తరలించే ఈ ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఇద్దరు నేతలు మాట్లాడుతూ, ప్రజల ప్రతి సంతకం ప్రభుత్వానికి ఇచ్చే శక్తివంతమైన హెచ్చరిక అని పేర్కొన్నారు. సేకరించిన అన్ని సంతకాలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, 15వ తేదీన ఇవి జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపనున్నట్లు తెలిపారు. 17వ తేదీన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాల పత్రాలను అందజేస్తారని వెల్లడించారు. కాగా, జగన్ గారు ప్రజల ఆరోగ్య హక్కు కోసం నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసం ప్రైవేటీకరణలోకి నెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇది పేద ప్రజలు మరియు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన దెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలయ్యి వాటిలో 7 పూర్తవగా, 5 కాలేజీల్లో అడ్మిషన్లు జరగగా, మిగతా కాలేజీల పనులు వివిధ దశల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు పీపీపీ పేరిట 10 కొత్త కాలేజీలను ప్రైవేటు పరం చేయడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు. ఈ తప్పుదారి వల్ల రాష్ట్రంలో మొత్తం 2,450 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. మెడికల్ కాలేజీలతో ఏర్పడే నర్సింగ్, పారా మెడికల్, వైద్య శిక్షణ సంస్థలు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించగలవని, ప్రతి ప్రాంత అభివృద్ధికి ఇవి మూలస్తంభాలవుతాయని గుర్తుచేశారు. వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దూరదృష్టిని దెబ్బతీసే నిర్ణయం ఇది కాబట్టి, ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణను వెనక్కి తీసుకొని, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తిచేసి ప్రభుత్వమే నడపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని గోవిందరెడ్డి గారు, సుధమ్మ గార్లు స్పష్టం చేశారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Dasari Sudha MLA, Badvel. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram