14/04/2026
అంబేద్కర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు
భారత రాజ్యాంగం పిత డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి ని పురస్కరించుకొని స్థానిక నెల్లూరు రోడ్ నందు గల అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఒక గొప్ప మానవతా వాది అని,అణగారిన వర్గాలు కోసం నిరంతరం పాటు పడిన ఒక గొప్ప మహనీయుడు అని కొనియాడారు
సమానత్వం,సామాజిక న్యాయం కోసం మరియు అభ్యుదయ భావాలే ఊపిరిగా జీవించి,ఆయన చూపిన మార్గం మన అందరికీ ఒక దిక్సూచి అని తెలిపారు
అంతేకాకుండా ప్రపంచం లేకెళ్ళ అతి పెద్ద రాజ్యాంగం అయిన మన భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఒక మార్గదర్శకుడు లాగా నిలిచిన ఒక గొప్ప మేధావి అని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం అనేది మన అందరికీ ఒక దిక్సూచి లాంటిది అని తెలిపారు.కావున మనం అందరం ఆయన ఆశయాలు కోసం పాటు పడాలని కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ రాజ గోపాల్ రెడ్డి,పార్టీ అధ్యక్షుడు శ్రీ సుందర రామిరెడ్డి,అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర బూత్ కన్వీనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యద్దా రెడ్డి,మాజీ మున్సిపాల్ వైస్ చైర్మన్ శ్రీ సాయి, శ్రీ గోపాల స్వామి ఇతర ముఖ్యమైన నాయకులు,ప్రముఖ దళిత సంఘాలు నాయకులు పాల్గొన్నారు