03/12/2025
⭐⭐టెక్నాలజి పెరిగేకొద్దీ శారీరక శ్రమ, మెదడుకి పని తగ్గిపోతున్నాయి. ఇప్పుడు స్నానం చేయడం, వళ్ళు తుడుచుకోవడం బద్ధకం అనుకునేవారికోసం బాత్ మెషీన్లు వచ్చేసాయి. పోయి ఆ మెషీన్లో పడుకుంటే , 15 నిమిషాలకు స్నానం, మసాజ్, చేయించేసి , వళ్ళు కూడా తుడిచేసి బయటకు పంపేస్తుంది. ఈ 15 నిమిషాల్లోనే చర్మం మీద డెడ్ సెల్స్ కూడా తీసేస్తుందట. జపాన్ లోని మిరై నింజన్ సెంతక్కి అనే కంపెనీ ఈ వాషింగ్ మెషీన్ తయారుచేసింది. ప్రస్తుతానికి 50 మెషీన్లు మాత్రమే చేసింది. ఒక్కో మెషీన్ ధర 3 కోట్ల 16 లక్షల రూపాయలు. ప్రస్తుతం తయారు చేసిన ఈ మెషీన్లు కొన్ని హాస్పిటల్స్, స్టార్ హోటల్స్ కు ఆర్దర్లు మీద తయారు చేసింది. ఈ మెషీన్లో వాటర్ జెట్స్, మైక్రో బబుల్స్, మెడికేటెడ్ వాషింగ్ జెల్స్ ఉంటాయి. స్నానం చేస్తున్నప్పుడే ఇష్టమైన మ్యూజిక్ వినొచ్చు. ఆ సమయంలోనే హార్ట్ బీట్, పల్స్ రేట్ కూడా చూసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ మెషీన్ల ధరలు తగ్గుతాయని కూడా కంపెనీ చెప్పింది..
⭐⭐⭐టెక్నాలజీ తో పనులని తేలికగా, వేగంగా చేపించుకోవచ్చు. కోటీశ్వరులకి ఇలాంటి మిషన్లు వృద్ధాప్యంలో ఉపయోగపడవచ్చు. పిల్లలు ఉన్నా, ఆస్తుల్ని చూసుకునేవారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి వృద్దులకి, లేవలేని పేషంట్లకి ఇలాంటివి అందుబాటు ధరలోకి వస్తే బాగుంటుంది.
⭐⭐⭐ఇలాంటి మిషన్లు అందుబాటు ధరల్లోకి వచ్చినా పనులు చేసుకోగలిగే వారు, తమ పనులు తామే చేసుకోవడమే మంచిది. టెక్నాలజీ ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుని వాడుకుంటే మంచిది