02/04/2026
*అమరావతి రాజధానికి చట్ట బద్ధతపై*
*హర్షం వ్యక్తం చేసిన డా.గోరంట్ల* *రవిరామ్ కిరణ్*
*నేడు ఆంధ్రుల రాజధాని అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో*
*బిల్లు పాస్ చేసి చట్ట భద్రత కలిపించిన శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసరం రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు పాల్గొనడం జరిగింది.*
ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు టపాసులు కాల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోకసభలో ఆమోదం లభించడం పై హర్షం వ్యక్తం చేశారు.బిల్లుకు మద్దతుగా నిలిచినా ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన దగ్గర నుండి అమరావతి రాజధాని గా ప్రకటించినప్పటికీ గత ప్రభుత్వ తీరుతో వైసీపీ వారి ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి రాజధాని కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులను ప్రజలను హింసించి వారిపై రాక్షసత్వం గా ప్రవర్తించిన తీరుకి మూడు రాజధానులు ముందుకు కొత్త ప్రస్తావన తీసుకువాచ్చిన తరుణంలో ప్రజలందరూ భయందోళనకు, మరియు గంధరగోళనికి గురి అయ్యారని కనీసం రాజధాని కోసం ఏ పని చెప్పటకుండా ఐదు సంవత్సరాలు ప్రజలను నమ్మబలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని రవిరామ్ కిరణ్ అన్నారు. నేడు మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధాముగా ప్రాణాలికలు సిద్ధం చేసుకుంటూ అటు పరిశ్రమలను, విద్య వైద్య, రంగాలను,సాఫ్ట్ వెర్ రంగాలకు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టె విధంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే నేడు అమరావతి రాజధాని కీ చట్ట బద్దత తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజల కలల సాకరం నిరవేర్చిన శుభ తరుణంలో నేడు కూటమి నాయకులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో టీడీపీ మహిళా నాయారాలు మజ్జి పద్మావతి, జనసేన నాయకులు చొప్ప చిన్నారావు,టీడీపీ నాయకులు
బీమారాశెట్టి రమేష్, కామిని భాస్కరరావు, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను,బొప్పన నాగేశ్వరావు,పిన్నమరెడ్డి ఈశ్వరుడు,నల్లమిల్లి వెంకన్న బాబు,
పండూరి అప్పారావు,మట్ట శ్రీను,వల్లూరి శ్రీరామ్ చౌదరి, నిచ్చనకొల్లా సత్తిబాబు, గోక శ్రీను,షేక్ సుభాన్,పత్తి మంగ,పిల్లా తనూజా, మద్ద మణి,గాలి వెంకటేశ్వరావు,కోటిపల్లి అమ్ములు, రాయుడు సునీల్,నీడీగట్ల కామేష్, పితాని రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.