18/09/2025
ది. 18-09-25 గురువారం ఉదయం 9 గంటలకు శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయిని ఎం.ప్రశాంతి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా: రవి రాం కిరణ్ గోరంట్ల గారు విచ్చేసి,
అసంపూర్ణంగా ఉన్న తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినారు.
ఈ నిధులను ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కృషితో APC సుభాషిని గారు T.E.O ద్వారా సుమారు 9 లక్షల రూపాయలు మంజూరు చేసినారు
ముఖ్య అతిథి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు NEET material GSR foundation సంస్థ ద్వారా అందిస్తామని, అలాగే ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానని, విద్యార్థులు మంచి ప్రగతి సాధించాలని కోరినారు,
అధ్యక్షులు ప్రశాంతి గారు మాట్లాడుతూ డా"రవి రాం కిరణ్ గారికి కమిటీ సభ్యులకు ఉపాధ్యాయులకు కార్యక్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు,
స్టాఫ్ సెక్రటరీ రాయుడు గారు మాట్లాడుతూ ఇంటర్ లో MPC, CEC రెండు గ్రూపులు ఉన్నాయి, ఎక్కువ విద్యార్థులు BIPC ,MLT కోర్సులు అడుగుతున్నారని వాటిని వచ్చే విధంగా పై అధికారులకు ప్రాతినిధ్యం చేయవలసిందిగా కోరినారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గెద్దాడ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ ఎలుగుబంటి దుర్గారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్స్సేటి శివ సత్య ప్రసాద్ , రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, నిచ్చెనకోళ్ల సత్తిబాబు, MSR శ్రీను, జనసేన నాయకులు సారిశెట్టి ప్రసాద్, బత్తిన అప్పారావు, ఉపాధ్యాయులు జె.శ్రీనివాస్, ఉమా రాణి గారు, గూకుల,లక్ష్మీ గారు, సత్తి రాజు గారు గ్రామ పెద్దలు తెలుగుదేశం, జనసేన, బిజెపి, కార్యకర్తలు పాల్గొన్నారు....