Seva Bharati-Vijayawada

Seva Bharati-Vijayawada Seva Bharati,Vijayawada
is a Non-Governmental Organisation
(NGO) started on 26-2-1990 registered under the act of
Public Charitable Trust.

It is serving the weaker sections of
the society irrespective of their caste and religion in the field
of Education

అల్లూరి సీతారామరాజు జిల్లా.చింతూరు మండలం చింతూరు దగ్గర నిమ్మలగుడెం రోడ్ లో ఉన్న ప్రభుత్వ జిల్లా హైస్కూల్ అవరణంలో ఏర్పాటు...
16/10/2023

అల్లూరి సీతారామరాజు జిల్లా.
చింతూరు మండలం చింతూరు దగ్గర నిమ్మలగుడెం రోడ్ లో ఉన్న ప్రభుత్వ జిల్లా హైస్కూల్ అవరణంలో ఏర్పాటు చేసిన సేవా భారతి విద్యా మిత్ర ట్రస్ట్ సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం.
సేవా భారతి ఆధ్వర్యంలో ఎటపాక మండలం కూనవరం మండలం వీఆర్ పురం మండలం చింతూరు మండలానికి సంబంధించి పూర్వ విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో సేవా భారతి అఖిలభారత నాయకులు శ్రీ బాగయ్య గారు .
సేవా భారతి .
అధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్ గారు యం.డి.
ఆరోగ్య భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్. పి ఎస్ రావు గారు
సేవా భారతి ప్రముఖ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ గారు పాల్గొన్నారు సేవా భారతి మరియు విద్యా మిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుపేద ఆదివాసి పిల్లలకు నర్సింగ్ కోర్సులో సంబంధించి వివిధ రకాల కోర్సులలో ఉచిత విద్యను అందించి వారు ఉద్యోగాలు పొందే విధంగా కృషిచేసి సుమారు వందమంది పైగా ఈ నాలుగు మండలాల నుంచి ఉద్యోగులు ఉన్నారని అదేవిధంగా సుమారు 100 మంది ఇంకా చదువుతున్నారు . ఈరోజు జరిగినటువంటి గిరిజన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థులు వారి యొక్క అనుభవాలను అదేవిధంగా పెద్దలు మార్గదర్శనం చేయడం జరిగినది.
నిర్వాహకులు డాక్టర్ మురళీకృష్ణ గారు మరియు చింతూరు సేవా భారతి వైద్యులు డాక్టర్ గంగాధర ప్రసాద్ గారు మరియు పూర్వ విద్యార్థుల సమన్వయకర్త కన్నా రాజు సోయం ,రాజు మోసం ,రాంబాబు,జోగారావు, కళ్యాణ్ మరియు తదితరులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు అదే విధంగా కాకినాడ రాజమండ్రి నుంచి సేవా భారతి జిల్లా మరియు రాష్ట్రస్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారని తెలియజేశారు.
కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు చక్కగా నిర్వహణ చేసి విజయవంతం చేశారని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలను సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేయడం జరిగినది. ఈరోజు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు కొద్దిమంది డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను హెల్త్ డిపార్ట్మెంట్ లోను కొద్దిమంది ఉపాధ్యాయ వృత్తిలోనూ మరి కొద్ది మంది సచివాలయం ఉద్యోగాలలోను మరి కొద్ది మంది పోలీస్ డిపార్ట్మెంట్లను ఈ విధంగా సుమారు వందమంది ఉద్యోగాలను చేస్తూ ఉన్నారని సుమారు 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక వందల వేల మందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సేవా భారతి యొక్క సేవలు అమూల్యం.
గోదావరి వరదలు వచ్చినప్పుడు అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయంలో కూడా పూర్వ విద్యార్థులు సేవాభారతి ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారని అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను చైతన్యవంతం చేయడంలో పూర్వ విద్యార్థుల ప్రముఖ పాత్ర వహిస్తున్నారని. సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు వచ్చి పనిచేయాలని నేను నాది నా ఇల్లు అన్నట్లుగా కాకుండా మనము మనది మన దేశం అనే భావనతో ప్రతి ఒక్కరు నిస్వార్ధంగా పనిచేయాలని అఖిల భారత సేవా భారతి ప్రముఖులు బాగయ్య గారు తెలియజేశారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని భవిష్యత్తులో వ్యవసాయానికి ప్రతి ఒక్కరు పెద్ద పీట వేయాలని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించాలని సేవా భారతీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహణ జరుగుతున్నదని ప్రత్యేకించి ఆదివాసుల కోసం షెడ్యూల్ ఏరియా ప్రాంతాలలో విస్తృతంగా ఏకోపాద్యాయ పాఠశాలలు, రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్స్, సేవాభారతి ఆధ్వర్యంలో రక్త నిధి కార్యక్రమాలు, స్వర్గీయ కర్నాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జరిగిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సేవా భారతి వివిధ రకాల ఆశ్రమాలు నిర్వహణ జరుగుతూ ఉన్నదని కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతి కోసం సేవా భారతి నిస్వార్ధంగా పనిచేస్తూ ఉన్నదని దీనికోసం అనేకమంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి కార్యక్రమాలకు సహకరిస్తున్నారని వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సేవా భారతి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రతినిధి కట్టం ముత్తయ్య గారు, ఆవుల సుబ్బారావు గారి యొక్క సేవలను కొనియాడారు,రాజమండ్రి జిల్లా కాకినాడ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి సేవా భారతి రామకృష్ణ గారు,
రాజమండ్రి నుంచి ఓలేటి సత్యనారాయణ గారు కాకినాడ నుంచి రాజా రామచంద్రమూర్తి గారు మరియు శ్రీ విజయ ఆదిత్య గారు, కాటేపల్లి లక్ష్మీనారాయణ గారు, రామచంద్ర మూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

డాక్టర్ వై సాయి కిషోర్ అధ్యక్షులు
సేవా భారతి విజయవాడ.

సేవా భారతి విజయవాడ  ఆధ్వర్యం లో ఈరోజు 01-10-2023 ఆదివారం నాడు జక్కంపూడి కాలనీలో జరిగే అభ్యాసికల విద్యార్థులకు వారి తల్లి...
01/10/2023

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యం లో ఈరోజు 01-10-2023 ఆదివారం నాడు
జక్కంపూడి కాలనీలో జరిగే అభ్యాసికల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉచిత వైద్య శిబిరం జరిగినది.ఈ శిబిరంలో 60 మంది పిల్లలు
20 మంది పెద్దలు వినియోగించుకున్నారు.
డాక్టర్ సాయి కిషోర్ గారు, చందమామ హాస్పిటల్, మరియు సేవా భారతి విజయవాడ అధ్యక్షులు ఈ వైద్య శిబిరము లో పాల్గొని పిల్లలను పెద్దలను పరీక్ష చేసి కావలసిన మందులు ఉచితముగా అందజేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారము, వ్యాయామము తదితర విషయాలు మరియు జ్ఞాపకశక్తి పెరగడానికి కావలసిన చిట్కాలు గురించి పిల్లలకు, పెద్దలకు విషయాలు చెప్పారు. ఈ వైద్య శిబిరంలో
సేవా భారతి కోఆర్డినేటర్ గుళ్ళపల్లిరామకృష్ణ మరియు అభ్యాసిక టీచర్లు సుధారాణి, హైమావతి, అరుణ, క్రాంతి, పాల్గొన్నారు కార్యదర్శి,
సేవా భారతి విజయవాడ.

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాజరాజేశ్వరి పేట, మహానాడు కట్ట, విజయవాడ వన్ టౌన్ లోని సుబ్రమణ...
06/09/2023

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాజరాజేశ్వరి పేట, మహానాడు కట్ట, విజయవాడ వన్ టౌన్ లోని సుబ్రమణ్య స్వామి కొండమీద అభ్యాసికల కేంద్రంగా అంగరంగ వైభవంగా జరిగాయి ముఖ్యంగా విజయవాడ వన్ టౌన్ కోమలావిలాస్ సెంటర్లోని సుబ్రమణ్య స్వామి కొండమీద సత్యనారాయణ స్వామి గుడి ఆవరణలో జరిగిన వేడుకలలో డాక్టర్ సాయి కిషోర్ గారు సేవా భారతి అధ్యక్షులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, బాగ్ 1 ప్రచారక్ శ్రీ భాను ప్రకాష్ గారు, రామకృష్ణ
సేవా భారతి కోఆర్డినేటర్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. శ్రీకృష్ణుని పూజ, కోలాట ప్రదర్శన,
ఉట్టి కొట్టడం తదితర కార్యక్రమాలు కనుల విందుగా జరిగాయి ముఖ్యంగా పిల్లలు ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ డాక్టర్ సాయి కిషోర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది.
M .సుబ్బశేఖర్ కార్యదర్శి
సేవా భారతి విజయవాడ.

05/09/2023
సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజీ సెంటర్లో జరిగే సాయిరవళి అభ్యాసిక లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  జరిగాయి...
16/08/2023

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజీ సెంటర్లో జరిగే సాయిరవళి అభ్యాసిక లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డాక్టర్ సాయి కిషోర్ గారు సేవా భారతి విజయవాడ అధ్యక్షులు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
శ్రీ పాలూరి శ్రీనివాస్ గారు ముఖ్య వక్త గా విచ్చేసి పిల్లలకు దేశభక్తి గురించి మంచి విషయాలు వివరించారు. పిల్లలు దేశ నాయకుల వేషధారణ వేసుకుని అలరించారు‌ ఈ కార్యక్రమం సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి గాయత్రి గారు, శ్రీమతి మాధురి గారు, శ్రీమతి మణి గారు మరియు సేవా భారతి కార్యకర్తలు మరియు అభ్యాసికల విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యదర్శి
సేవా భారతి విజయవాడ

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యం లో  13-08-2023 ఆదివారం నాడు కోమల విలాస్ సెంటర్లోని సుబ్రమణ్య స్వామి గుడి కొండమీద జరిగే అభ్యా...
15/08/2023

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యం లో 13-08-2023 ఆదివారం నాడు
కోమల విలాస్ సెంటర్లోని సుబ్రమణ్య స్వామి గుడి కొండమీద జరిగే అభ్యాసికల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉచిత వైద్య శిబిరం జరిగినది.ఈ శిబిరంలో 51 మంది పిల్లలు
9 మంది పెద్దలు వినియోగించుకున్నారు.
డాక్టర్ సాయి కిషోర్ గారు చందమామ హాస్పిటల్ చైర్మన్ మరియు సేవా భారతి విజయవాడ అధ్యక్షులు ఈ వైద్య శిబిరము లో పాల్గొని పిల్లలను పెద్దలను పరీక్ష చేసి కావలసిన మందులు ఉచితముగా అందజేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారము, వ్యాయామము తదితర విషయాలు మరియు జ్ఞాపకశక్తి పెరగడానికి కావలసిన చిట్కాలు గురించి పిల్లలకు, పెద్దలకు విషయాలు చెప్పారు.
సేవా భారతి కోఆర్డినేటర్ రామకృష్ణ మరియు అభ్యాసిక టీచర్లు సహకారాన్ని అందించారు. కార్యదర్శి
సేవా భారతి విజయవాడ.

అందరికీ నమస్కారం విజయవాడ విభాగ్ లోని ఏలూరు జిల్లా లోని అభ్యాసికల టీచర్లకు , కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం లోని అభ్యాసికల ట...
31/07/2023

అందరికీ నమస్కారం విజయవాడ విభాగ్ లోని ఏలూరు జిల్లా లోని అభ్యాసికల టీచర్లకు , కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం లోని అభ్యాసికల టీచర్ల కు మరియు విజయవాడ మహా నగర్ లోని అభ్యాసికల టీచర్లకు మరియు పర్యవేక్షకులకు ప్రశిక్షణా వర్గ
సేవా భారతి విజయవాడ కార్యాలయం, దదీచిలో జరిగింది. 46 మంది టీచర్లు మరియు 6గురు పర్యవేక్షకులు పాల్గొన్నారు
ఈ ప్రశిక్షణా వర్గ లో ప్రాంత సేవా ప్రముఖ్
శ్రీ కేశవయ్య గారు పాల్గొని అభ్యాసికల ఆధారంగా బస్తీలలో రావలసిన మార్పు, జరగాల్సిన కార్యక్రమాలు మొదలగు వాటిని గురించి వివరంగా తెలియజేశారు. టీచర్లకు ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ లో మెళుకువలు పిల్లలకి ఎలా తెలియచేయాలో శ్రీ భాస్కర్ గారు విజ్ఞాన విహార స్కూల్ సత్యనారాయణపురం మ్యాథమెటిక్స్ మాస్టారు మరియు మన మాతృభాష అయినా తెలుగు ను పిల్లలకు సులభంగా ఎలా నేర్పాలో
శ్రీ ఝాన్సీ మేడం గారు
విజ్ఞాన విహార స్కూల్ సత్యనారాయణపురం తెలుగు టీచర్ గారు విచ్చేసి టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విజయవాడ విభాగ్ ప్రచారక్ శ్రీ నవీన్ గారు విచ్చేసి పిల్లల కు సుపోషణ అందజేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యం గా ఉండాలని మరియు, పిల్లలంతా బాగా చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని తద్వారా ఆ బస్తీలో కుటుంబాలన్నీ ఆనందంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలన్నిటికి అభ్యాసిక కేంద్ర బిందువు కావాలని తెలియజేశారు.
ఈ ప్రశిక్షణా వర్గ మొత్తము సేవా భారతి విజయవాడ
సహ కార్యదర్శి
శ్రీమతి బోయపాటి మాధురి గారి పర్యవేక్షణలో జరిగింది
సేవా భారతి విజయవాడ నుంచి ఉపాధ్యక్షులు శ్రీమతి పత్తి నాగలక్ష్మి గారు, సేవా భారతి కోశాధికారి
శ్రీ మాదిరాజు మాధవ గారు మరియు సేవా భారతి విజయవాడ కోఆర్డినేటర్ రామకృష్ణ, సేవా భారతి విజయవాడ కార్యకర్తలు మరియు టీచర్లు పాల్గొన్నారు.
శ్రీ సుబ్బ శేఖర్
కార్యదర్శి
సేవా భారతి విజయవాడ .

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యం లో  23-07-2023 ఆదివారం నాడు రాజ రాజేశ్వరి పేట లోని అభ్యాసికల విద్యార్థులకు వారి తల్లిదండ్రుల...
24/07/2023

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యం లో 23-07-2023 ఆదివారం నాడు
రాజ రాజేశ్వరి పేట లోని అభ్యాసికల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉచిత వైద్య శిబిరం జరిగినది.ఈ శిబిరంలో 53 మంది పిల్లలు
10 మంది పెద్దలు వినియోగించుకున్నారు.
డాక్టర్ సాయి కిషోర్ గారు చందమామ హాస్పిటల్ చైర్మన్ మరియు సేవా భారతి విజయవాడ అధ్యక్షులు ఈ వైద్య శిబిరము లో పాల్గొని పిల్లలను పెద్దలను పరీక్ష చేసి కావలసిన మందులు ఉచితముగా అందజేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారము, వ్యాయామము తదితర విషయాలను గురించి పిల్లలకు, పెద్దలకు విషయాలు చెప్పారు. సేవా భారతి సహ కార్యదర్శి
శ్రీమతి బోయపాటి మాధురి గారు,
సేవా భారతి కోఆర్డినేటర్ రామకృష్ణ మరియు అభ్యాసిక టీచర్లు సహకారాన్ని అందించారు. కార్యదర్శి
సేవా భారతి విజయవాడ.

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో మధురానగర్ లోని వెంకటేశ్వర నగర్ లో ఉచిత వైద్య శిబిరము ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అ...
29/06/2023

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో మధురానగర్ లోని వెంకటేశ్వర నగర్ లో ఉచిత వైద్య శిబిరము ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షులు
శ్రీమతి గాయత్రి గారి తండ్రి గారైన కీర్తిశేషులు కొడంచా రంగారావు గారి జ్ఞాపకార్థం వారి
శ్రీమతి కె. సునీత గారి సౌజన్యంతో జరిగినది ఈ శిబిరంలో 45 మంది పిల్లలు
40 మంది పెద్దలు వినియోగించుకున్నారు.
డాక్టర్ సాయి కిషోర్ గారు చందమామ హాస్పిటల్ చైర్మన్ మరియు సేవా భారతి విజయవాడ అధ్యక్షులు ఈ వైద్య శిబిరము లో పాల్గొని పిల్లలను పెద్దలను పరీక్ష చేసి కావలసిన మందులు ఉచితముగా అందజేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారము, వ్యాయామము తదితర విషయాలను గురించి పిల్లలకు, పెద్దలకు విషయాలు చెప్పారు.
సేవా భారతి కోఆర్డినేటర్ రామకృష్ణ మరియు అభ్యాసిక టీచర్లు సహకారాన్ని అందించారు. కార్యదర్శి
సేవా భారతి విజయవాడ.

అందరికీ నమస్కారం 2023 -24 విద్యా సంవత్సరంలో  టీచర్ల కు మొదటి ప్రశిక్షణా వర్గ నిన్న సేవా భారతి విజయవాడ కార్యాలయం దదీచిలో ...
26/06/2023

అందరికీ నమస్కారం 2023 -24 విద్యా సంవత్సరంలో టీచర్ల కు మొదటి ప్రశిక్షణా వర్గ నిన్న సేవా భారతి విజయవాడ కార్యాలయం దదీచిలో జరిగింది 40 మంది టీచర్లు పాల్గొన్నారు ఈ ప్రశిక్షణా వర్గకు డాక్టర్ మురళీకృష్ణ గారు ఆరోగ్య మిత్ర అఖిల భారత సంయోజక్
గారు విచ్చేసి ఆరోగ్య రక్షక్ కిట్లు పంపిణీ చేశారు మరియు వాటి యొక్క ఉపయోగాలు గురించి ప్రశిక్షణ జరిగింది సేవా భారతి విజయవాడ నుంచి అధ్యక్షులు
డాక్టర్ వై సాయి కిషోర్ గారు
సేవా భారతి కార్యదర్శి శ్రీ సుబ్బ శేఖర్ గారు
సహ కార్యదర్శి
శ్రీమతి మాధురి గారు సేవా భారతి కార్యకర్తలు మరియు టీచర్లు పాల్గొన్నారు.

సేవా భారతి విజయవాడ అధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దివస్ విజయవాడ ఫన్ క్లబ్ లో జరిగింది ఈ కార్యక్రమంలోశ్రీ సుబ్బ శేఖర్ గారు సే...
22/06/2023

సేవా భారతి విజయవాడ అధ్వర్యంలో
అంతర్జాతీయ యోగా దివస్ విజయవాడ ఫన్ క్లబ్ లో జరిగింది ఈ కార్యక్రమంలో
శ్రీ సుబ్బ శేఖర్ గారు సేవా భారతి విజయవాడ కార్యదర్శి యోగ నేర్పించారు. అనేక మంది ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు, అతిథులు పాల్గొన్నారు. అధ్యక్షులు
సేవా భారతి విజయవాడ

సేవా భారతి విజయవాడ అధ్వర్యంలో  వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల4రోజు ముగింపు కార్యక్రమానికి సేవా భారతి విజయవాడ కార్యదర్శి...
05/05/2023

సేవా భారతి విజయవాడ అధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల
4రోజు ముగింపు కార్యక్రమానికి
సేవా భారతి విజయవాడ కార్యదర్శి అయిన శ్రీ మలాయతి సుబ్బ శేఖర్ గారు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా
శ్రీ అన్నే రామకృష్ణ కిషోర్ గారు విచ్చేశారు. ముఖ్య వక్తగా శ్రీ నవీన్ గారు, విజయవాడ విభాగ్ ప్రచారక్ గారు పిల్లల ప్రదర్శనను చూసి ఆశీర్వదించారు.
పిల్లలు ఈ నాలుగు రోజులు పాటు నేర్చుకున్న అభినయ గేయాలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు, మరియు చదువుకు సంబంధించిన విషయాలు ప్రదర్శన చేసి చూపించారు, అలాగే ఈ నాలుగు రోజుల్లో తాము చదువుతోపాటుగా నేర్చుకున్న ముఖ్య విషయాలను గుర్తుంచుకుని రోజు పాటిస్తామని చెప్పారు. ఈ నాలుగు రోజులు కార్యక్రమంలో ప్రతిరోజూ గణితాన్ని బోధించిన శ్రీమతి లక్ష్మీ రామానుజ మేడం గారికి సేవా భారతి విజయవాడ కార్యదర్శి శ్రీ సుబ్బ శేఖర్ గారు జ్ఞాపికను అందజేశారు. ఈరోజు 90మంది విద్యార్థులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో
సేవా భారతి సహ కార్యదర్శి శ్రీమతి బోయపాటి మాధురి గారు మరియు
సేవా భారతి కమిటీ సభ్యులు డాక్టర్ పెపేటి శ్రీధర్ గారు
శ్రీ గుళ్ళపల్లి రామకృష్ణ గారు ,
సేవా భారతి టీచర్స్ మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యదర్శి
సేవా భారతి విజయవాడ.

Address

Madava Sadan, Kaleswara Rao Road, Governover Pet, Vijayawada
Vijayawada
520002

Telephone

+919701381723

Website

Alerts

Be the first to know and let us send you an email when Seva Bharati-Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Seva Bharati-Vijayawada:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category