Gayathree Institutions

Gayathree Institutions GAYATHREE INSTITUTIONS WANAPARTHY Our Management:
* P. Pushpalatha (Chairman)
* D. Vijaya Bhaskar Rao (Vice President)
* T.P.

Gayathri Institutions in Wanaparthy: Gayathri Institutions started in 2001, Related colleges Gayathri Degree & P.G College, Gayathri B.Ed College with Well Experienced faculty & Facilities. Krishnaiah, M.Sc (Secretary Cum Correspondent)
* Madavi Latha, M.A (Joint Secretory)
* S.R. Shankaramma (Treasurer)
Courses Offered:
B.sc (Bio-Technology) - 3 Years Course
* Bio-Technology
* Zoology
* Chemistry
B.Sc (M.P.Cs) - 3 Years Course
* Maths
* Physics
* Computer Science
B.Sc (M.P.C) - 3 Years Course
* Maths
* Physics
* Chemistry
B.Sc (B.Zc) - 3 Years Course
* Botany
* Zoology
* Chemistry
B.Com - 3 Years Course
* Computer Application
B.A (H.E.P) - 3 Years Course
* History
* Economics
* Political Science
P.G Courses
* M.Sc - Organic Chemistry - 2 Years Course
Our Facilities:
* Qualified, Experienced and Dedicated Staff.
* Providing Practicals from college Starting onwards
* NSS Unit in Degree College
* Conducts on Every Saturday Sports, Essay Writing, Speeches & Quiz Competetions
* Provide Training for Spoken English, Personality Development, Communication Skills
* Separate Hostel Facility for Boys & Girls

18/02/2017

IBM HIRING for IT Tech support for Freshers/Experienced Walkin 11-3pm at Raheja IT Park 3B Mindspace Exp 0-4yrs

16/02/2015

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో 6425 క్ల‌రిక‌ల్ పోస్టులు
* తెలుగు రాష్ట్రాల్లో 1294 ఉద్యోగాలు
* వీటిలో ఎస్‌బీహెచ్ వాటా 1240
* తెలంగాణ‌లో 1012, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 282 మొత్తం ఖాళీలు
బ్యాంకుల్లో నియామ‌కాల జోరు పెరుగుతోంది. ఒక ప‌రీక్ష పూర్త‌యిన‌వెంట‌నే మ‌రో ప‌రీక్ష‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతోంది. తాజాగా అనుబంధ బ్యాంకుల్లో ఖాళీలు భ‌ర్తీ చేయ‌డానికి ఎస్‌బీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. 5 బ్యాంకుల్లో దేశ‌వ్యాప్తంగా 6425 ఖాళీలున్నాయి. వీటిలో ఐదో వంతు పోస్టులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండ‌డం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో మొత్తం 1294 ఉద్యోగాలున్నాయి. ఇందులో 1240 మందిని ఎస్‌బీహెచ్ భ‌ర్తీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ బ్యాంకు ద్వారా వెయ్యి మందికి కొలువు సొంతం కానుంది. ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్ష‌కు ఎలా స‌న్నద్ధం కావాలో తెలుసుకుందాం.
ఖాళీలిలా...
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్‌బీహెచ్‌లో 1000, బిక‌నీర్ అండ్ జైపూర్ బ్యాంక్‌లో 12 పోస్టులు ఉన్నాయి.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎస్‌బీహెచ్‌లో 240, ట్రావెన్‌కోర్ బ్యాంకులో 30, బిక‌నీర్ అండ్ జైపూర్ బ్యాంక్‌లో 12 ఖాళీలున్నాయి.
ముఖ్య‌మైన తేదీలు:
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 20, 2014 నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 9, 2014
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 11, 2014
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు రూ.వంద‌, మిగిలిన అంద‌రికీ రూ.600
ఆన్‌లైన్ ప‌రీక్ష‌: 2015 జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో వివిధ తేదీల్లో నిర్వ‌హిస్తారు.

16/02/2015

డిగ్రీతో నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్ ఉద్యోగం
» ఎంపికైతే రూ.40 వేల‌కు పైగా వేత‌నం
» బ్యాంకు ప‌రీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నవారికి ప్రయోజ‌నం
» మొత్తం ఖాళీలు 128

భార‌త ప్రభుత్వానికి చెందిన జాతీయ వ్యవ‌సాయ‌, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్‌) గ్రేడ్ ఎ అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఈ ఉద్యోగాల‌కు డిగ్రీ విద్యార్థులు పోటీప‌డొచ్చు. ఇప్పటికే బ్యాంకు ప‌రీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నవారు నాబార్డ్ ప‌రీక్షలో రాణించొచ్చు. రెండు ప‌రీక్షల్లోనూ అంశాలు ఉమ్మడిగా ఉండ‌డం అభ్యర్థుల‌కు క‌లిసొచ్చే అంశం. ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో అర్హత‌లు, ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ గురించి తెలుసుకుందాం.
విభాగాల వారీ పోస్టులిలా..
అసిస్టెంట్ మేనేజ‌ర్ గ్రేడ్ ఎ (ఆర్‌డీబీఎస్‌) - 100
మేనేజ‌ర్స్ గ్రేడ్ బి (ఆర్‌డీబీఎస్‌) - 6
అసిస్టెంట్ మేనేజ‌ర్స్‌ (రాజ‌భాష స‌ర్వీస్‌) - 6
అసిస్టెంట్ మేనేజ‌ర్స్ (లీగ‌ల్ స‌ర్వీస్‌) - 3
అసిస్టెంట్ మేనేజ‌ర్స్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ స‌ర్వీసెస్‌) - 10
విద్యార్హత‌: అసిస్టెంట్ మేనేజ‌ర్ గ్రేడ్ ఎ రూర‌ల్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (ఆర్‌బీఎంఎస్‌) పోస్టుల‌కు ఏదైనా డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మేనేజ‌ర్ గ్రేడ్ బి ఆర్‌బీఎంఎస్ పోస్టుల‌కు ఏదైనా డిగ్రీలో 60 శాతం లేదా పీజీలో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాజ‌భాష స‌ర్వీస్‌, లీగ‌ల్ స‌ర్వీస్‌, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ స‌ర్వీస్ పోస్టుల‌కు సంబంధిత విభాగాల్లో డిగ్రీలు ఉండాలి.
వ‌యోప‌రిమితి: న‌వంబ‌ర్ 30, 2014 నాటికి 30 ఏళ్లకు మించ‌రాదు. అంటే డిసెంబ‌ర్ 1, 1984 కంటే ముందు న‌వంబ‌ర్ 30, 1993 త‌ర్వాత జ‌న్మించిన‌వారు అన‌ర్హులు. (ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు కేట‌గిరీని బ‌ట్టి ప‌దేళ్ల నుంచి ప‌దిహేనేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 15, 2015
ప‌రీక్ష ఫీజు: ఏ పోస్టుకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు రూ. వంద‌; మిగిలిన అంద‌రు అభ్యర్థుల‌కు గ్రేడ్‌-ఎ పోస్టుల‌కు రూ.750, గ్రేడ్-బి పోస్టుల‌కు రూ.850.
ప‌రీక్ష తేదీ: ఫిబ్రవ‌రి, మార్చి నెల‌ల్లో వివిధ తేదీల్లో ఆన్‌లైన్ ప‌రీక్షలు ఉంటాయి. ఆదివారాలు కాకుండా ప‌నిదినాల్లోనే ఈ ప‌రీక్షల‌ను నిర్వహిస్తారు. ప‌రీక్ష తేదీల‌ను నాబార్డ్ వెబ్‌సైట్‌లో త‌ర్వాత ప్రక‌టిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఫేజ్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలు: చీరాల‌, శ్రీకాకుళం, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, కాకినాడ‌, చిత్తూరు, కంచిక‌చెర్ల, గుడ్లవెల్లూరు, ఏలూరు, విజ‌య‌నగ‌రం
తెలంగాణ‌లో: హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ కేంద్రాలు, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం
ఫేజ్ 2 ప‌రీక్ష కేంద్రాలు: ముంబై, న్యూఢిల్లీ, కోల్‌క‌తా, చెన్నై గువాహ‌తి.
వేత‌నాలిలా...
గ్రేడ్‌-ఎ పోస్టుల‌కు ప్రస్తుతం మూల‌వేత‌నం రూ. 17100గా ఉంది. ఎంపికైన‌వారికి నెల‌కు రూ.40,562 ద‌క్కుతుంది. త్వర‌లో ఈ వేత‌నాలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. గ్రేడ్-బి పోస్టుల‌కు రూ.50669 వేత‌నంగా ల‌భిస్తుంది. జీతంతోపాటు వివిధ ప్రోత్సాహ‌కాలుంటాయి.
ఎంపిక విధానం
ఫేజ్ 1 ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌, ఫేజ్ 2 మెయిన్ ప‌రీక్షలు, ఫేజ్ 3లో నిర్వహించే మౌఖిక ప‌రీక్ష ద్వారా
ఫేజ్‌-1: ఈ ప‌రీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పూర్తిగా ఇది ఆబ్జెక్టివ్ ప‌రీక్ష. ఏ పోస్టుకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ అంద‌రికీ ఈ ప‌రీక్ష మాత్రం ఉమ్మడిగానే ఉంటుంది. మొత్తం 200 మార్కుల‌కు ప్రశ్నల‌డుగుతారు.ప‌రీక్ష వ్యవ‌ధి 130 నిమిషాలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి 50, రీజ‌నింగ్ 50, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ 30, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 40 మార్కుల‌కు ఉంటాయి. ఈ ప‌రీక్షలో ఉత్తీర్ణుల‌నే ఫేజ్‌-2కి అనుమతిస్తారు. ఇది కేవ‌లం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.
ఫేజ్‌-2: ఈ ప‌రీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్ 1 అన్నిపోస్టుల‌కు కామ‌న్‌. ఈ పేప‌ర్లో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ విభాగం నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు వంద‌. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు. అభ్యర్థిలో ఆంగ్లభాషలో రాసే, విశ్లేషించే ప‌రిజ్ఞానం ఏమేర‌కు ఉందో ప‌రిశీలిస్తారు. దీనికోసం ఎస్సే, కాంప్రహెన్షన్‌, రిపోర్ట్, పారాగ్రాఫ్‌, లెట‌ర్ రైటింగ్‌ల్లో ప్రశ్నల‌డుగుతారు. పేప‌ర్ 2లో ఆర్థిక, సాంఘిక అంశాల‌పై ప్రశ్నలుంటాయి.. ఆర్‌బీఎంఎస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి ఈ పేప‌ర్ కామ‌న్‌గా ఉంటుంది. ఇది కూడా పూర్తిగా డిస్క్రిప్టివ్‌ ప‌రీక్షే. వ్యవ‌ధి 3 గంట‌లు. ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో జ‌వాబులు రాసుకోవ‌చ్చు.
ఫేజ్‌-3: ఫేజ్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ బ‌ట్టి అభ్యర్థుల‌ను ఫేజ్ 3లో నిర్వహించే ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. ఫేజ్‌-2లో సాధించిన మార్కులు, ఇంట‌ర్వ్యూ మార్కుల‌ను క‌లిపి తుది ఎంపిక చేప‌డ‌తారు. అయితే ఇంట‌ర్వ్యూకు ఎన్ని మార్కులు కేటాయించారో ప్రక‌ట‌న‌లో స్పష్టం చేయ‌లేదు.
స‌న్నద్ధమిలా...
ఇప్పటికే బ్యాంకు ఉద్యోగం ల‌క్ష్యంగా పెట్టుకున్నవారు ఫేజ్‌-1 ప్రిలిమిన‌రీ ఆన్‌లైన్ ప‌రీక్షను ఎదుర్కోవ‌చ్చు. ఎందుకంటే ఈ రెండు ప‌రీక్షల్లోనూ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. అందువ‌ల్ల బ్యాంకు ప‌రీక్షల స‌న్నద్ధత‌తో నాబార్డ్ అసిస్టెంట్ పోస్టుల‌కు సిద్ధం కావొచ్చు. అభ్యర్థులు వీలైన‌న్ని మోడ‌ల్ ప్రశ్నప‌త్రాలు సాధ‌న‌చేయాలి. ఫేజ్ 1లో రాణిస్తేనే ఫేజ్ 2కి ఎంపిక‌చేస్తారు కాబ‌ట్టి పూర్తిస్థాయి స‌న్నద్ధత అవ‌స‌రం. ఫేజ్ 2లో పేప‌ర్ 1ను ఎదుర్కోవ‌డానికి ఇంగ్లిష్‌పై ప‌ట్టుండాలి. కేవ‌లం వ్యాక‌ర‌ణాంశాలు తెలిస్తే స‌రిపోదు. అభ్యర్థి ర‌చ‌నా కౌశలాన్ని ప‌రిశీలిస్తారు. అందువ‌ల్ల త‌ప్పులు లేకుండా, ప్రభావ‌వంతంగా రాయ‌డాన్ని ఇప్పటి నుంచే సాధ‌న చేయాలి. ఈ ఫేజ్‌లోనే పేప‌ర్ 2 అర్ధశాస్త్ర అంశాల‌పై ఉంటుంది. డిగ్రీ స్థాయిలో ఎక‌నామిక్స్ చ‌దివిన‌వారు ఈ పేప‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. పేప‌ర్ 2ను సిల‌బ‌స్ ప్రకారం ఇప్పటి నుంచే చ‌దువుకోవాలి. ఆర్థిక‌రంగంలోని ముఖ్యాంశాల‌ను నోట్సుగా రాసుకోవ‌డం, హిందూ దిన‌ప‌త్రిక‌లో ఈ రంగంపై వ‌చ్చే వ్యాసాల‌ను చ‌ద‌వ‌డం ద్వారా పేప‌ర్ 2ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌చ్చు. సైన్స్ విద్యార్థులు ఈ పేప‌ర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూప‌డం త‌ప్పనిస‌రి.

16/02/2015

మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ / పార్ట్ టైమ్ / దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ చేయాలంటే I-CET (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యామండలి ఈ పరీక్ష నిర్వహిస్తుంది. మంచి ర్యాంకు సంపాదించుకుంటే మంచి కాలేజీలో సీటు సంపాదించుకోవచ్చు. పోటీ బాగానే ఉంటుంది.
stay tuned complete details will be given ..................

16/02/2015

the students those who r going to pursue mba / mca next u hav to appear for icet .. integrated common entrance test which is going to be conducted by on behalf of kakatiya university warangal on 22 may //....

16/02/2015

gd aftn all .....................................

16/02/2015

all current affairs will be posted here guys u cn check it here ....... thank u ..............

16/02/2015

14 ఫిబ్రవరి 2015న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో లెఫ్ట్-నెంట్ గవర్నర్ నజీబ్ జుంగ్, అరవింద్ కేజ్రీవాల్ చేత ప్రమాణస్వీకారం చేయిపించారు.
అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరో ఆరుగురు: మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమార్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్ మరియు అసిం అహ్మద్ ఖాన్ లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

13 ఫిబ్రవరి 2015న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ యొక్క జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ను నియమించారు.
14 ఫిబ్రవరి 2015న ఈ నియామకంతో, ఇప్పటివరకు అమల్లోవున్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. రాజ్యాంగంలోని 239AB అధికరణ ప్రకారం, 16 ఫిబ్రవరి 2014 నుండి ఢిల్లీ యొక్క జాతీయ రాజధాని ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించారు.
ముఖ్యమంత్రితో సలహా అతని సలహామేరకు ఆరుగురు ఆప్ నాయకులను మంత్రులుగా రాష్ట్రపతి నియమించారు.
ఢిల్లీకి, కేజ్రివాల్, వ్యక్తి పరంగా 7వ ముఖ్యమంత్రి మరియు పదవీకాలం ప్రకారం 10వ ముఖ్యమంత్రి అయ్యారు.
ఢిల్లీ కేబినెట్ మరియు వారి శాఖలు:
అరవింద్ కేజ్రీవాల్: ముఖ్యమంత్రి
మనీష్ సిసోడియా: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక & ప్రణాళిక, విద్య,పట్టణాభివృద్ధి, రెవిన్యూ లతోపాటు ఏ మంత్రికి అప్పచెప్పని మిగిలిన శాఖలు
సందీప్ కుమార్: మహిళలు మరియు పిల్లల సామాజిక సంక్షేమం, భాషా, షెడ్యుల్ కులాలు/ షెడ్యుల్ తెగలు
గోపాల్ రాయ్: రవాణా, అభివృద్ధి, కార్మిక, సాధారణ పరిపాలన విభాగం మరియు ఉపాధి
అసిం అహ్మద్ ఖాన్: ఆహారం మరియు ప్రజాపంపిణి శాఖ, అటవీ మరియు పర్యావరణం, ఎన్నికలు
జితేందర్ సింగ్ తోమర్: లా అండ్ జస్టిస్, హోం, టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్
సత్యంద్ర జైన్: విద్యుత్, ఆరోగ్యం, పరిశ్రమలు, PWD మరియు IFC

ఢిల్లీ ముఖ్యమంత్రుల జాబితా
క్రమ సంఖ్య
ముఖ్యమంత్రి పేరు
సంవత్సరం
పదవీకాలం
1.
చౌదరి బ్రహ్మ ప్రకాష్
1952
ఒకసారి
2.
G N సింగ్
1955
ఒకసారి
3.
మదన్ లాల్ ఖురానా
1993
ఒకసారి
4.
సాహిబ్ సింగ్ వర్మ
1996
ఒకసారి
5.
సుష్మా స్వరాజ్
1998
ఒకసారి
6.
షీలా దీక్షిత్
1998
మూడు సార్లు
7.
అరవింద్ కేజ్రివాల్
2013
రెండు సార్లు

16/02/2015

stay tuned guys latest notifications and posts will be displayed here ................all the best

16/02/2015

14 ఫిబ్రవరి 2015 న, భారత నౌకాదాళము యొక్క తాజా విధ్వంసకారిణి ఐఎన్ఎస్ కోలకతా నుండి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
క్షిపణి యొక్క అన్నిరూపకల్పనా పరిమితులు కలిగి ఉండడంతో గోవా తీరంనుండి ప్రయోగించారు.
బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధి 290 కిలోమీటర్లు మరియు 300 కిలోగ్రాముల సంప్రదాయ వార్ హెడ్ ను తీసుకునిపోతుంది. ఇది మాక్ 2.8, వేగాన్ని కలిగి ఉంది. ఇది అమెరికా క్షిపణి తోమహాక్ క్రూయిజ్ క్షిపణి కంటే మూడు రెట్లు వేగవంతమైనది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులులో బ్రహ్మోస్ క్షిపణి ఒకటి. జలాంతర్గాములు, నౌకలు, విమానాలు మరియు భూమి నుండి కూడా దీనిని ప్రయోగించవచ్చు.

ఐఎన్ఎస్ కోలకతా గురించి:
ఐఎన్ఎస్ కోలకతా,పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అతిపెద్ద యుద్ధనౌక. 2014 ఆగష్టు 16 న భారత నౌకాదాళములో ప్రారంభించారు. ఈ యుద్ధనౌకను నేవీ డిజైన్ బ్యూరో రూపొందించగా, మజగోన్ డాక్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది దీని బరువు 6800 టన్నులు మరియు ఇది ఒక సాంకేతిక ప్రదర్శనకారి.
దీని సముద్ర పరీక్షలు పూర్తయిన తర్వాత జూలై 2014 లో భారత నావికాదళానికి అందజేయబడింది, భారత నౌకాదళం యొక్క కోలకతా క్లాస్ విధ్వంసకారినిలలో . ఐఎన్ఎస్ కోలకతా ఒకభాగం. కోలకతా క్లాస్ విధ్వంసకారినిలలో రాబోనున్న ఐఎన్ఎస్ కొచీ మరియు ఐఎన్ఎస్ చెన్నై కూడా వున్నాయి.
ఐఎన్ఎస్ కోలకతా, సాల్వో మోడ్ లో 16 క్షిపణిలను ను ఫైర్ చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. సాధారణంగా ఇతర నౌకలు ఎనిమిది క్షిపణులను ఫైర్ చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

Is this article important for exams ? YesNext Next Story
క్యాన్సర్ మరియు అంటు వ్యాధులు కోసం కొత్త 3D టీకాను కనుగొన్న పరిశోధకులు

ఐఎన్ఎస్ కోలకతా, బ్రహ్మోస్ క్షిపణి

16/02/2015

hi every 1 all the best for your practical examinations ......

Address

Bandar Nagar, Mahabubnagar (Dist)
Wanaparthy
509103

Alerts

Be the first to know and let us send you an email when Gayathree Institutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gayathree Institutions:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram